FLASH NEWS: గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 11:00 AM

FLASH NEWS: గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం!

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఆస్తులు వేలం వేస్తున్నట్లు చెబుతున్నారు. రుణ బకాయిలు సుమారు రూ.209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు. మిగతా బకాయిల కోసం వ్యక్తి గత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ఉందని బ్యాంకు చెబుతోంది. గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. *వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటాకు పేరిట ఉన్న విశాఖ ఉత్తరనియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆస్తుల వేలం అంశంపై తెరపైకి వచ్చింది. దీనిపై గంటా కూడా వివరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆస్తుల వేలం తెరపైకి వచ్చింది. దీనిపై గంటా శ్రీనివాసరావు స్పందించాల్సి ఉంది.






Untitled Document
Advertisements