ఏపీ సీఎం జగన్ దంపతులు గవర్నర్తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలపై గవర్నర్ సీఎం జగన్ చర్చించారు. ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్థం భోజనం ఏర్పాటుచేశారు రాజ్భవన్ వర్గాలు.