గుంటూరు జిల్లా పొట్లూరు గ్రామంలోని శ్మశాన వాటికలో యువతి దహనం కలకలం రేపుతోంది. అర్దరాత్రి సమయంలో యువతిని శ్మశాన వాటికలో తగలపెట్టారు గుర్తుతెలియని దుండగులు. యువతి శరీరం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. యువతిని ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ కేసుల ఆనవాళ్లు పరిశీలిస్తున్నారు అధికారులు.