రెండో టీ20లో సంజూకి ఛాన్స్...ట్వీట్ అర్ధం అదేనా..!

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 04:45 PM

రెండో టీ20లో సంజూకి ఛాన్స్...ట్వీట్ అర్ధం అదేనా..!

టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌ కల నేరే అవకాశముందని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలిమ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ పండుగ చేసుకున్న ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో గెలుపొందిన ఇండియా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 కోసం కేరళ రాజధాని తిరువనంతపురానికి కోహ్లీసేన చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శాంసన్‌ ట్వీట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. తాము తిరువనంతపురం వచ్చామని ట్వీట్ చేశామని ట్వీట్ చేసిన సంజూ.. ఎడమవైపు డైవ్ చేస్తూ బంతిని అందుకునే ప్రయత్నం చేస్తున్న ఫొటోను షేర్ చేశాడు. ఈక్రమంలో సొంతగడ్డపై జరిగే రెండో మ్యాచ్‌లో తనకు ప్లేయింగ్ లెవన్‌లో చాన్స్ దక్కే అవకాశముందని సంజూ ఈ ట్వీట్ ద్వారా సంకేతమిస్తున్నాడని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రస్తుతం టీమిండియా పరిస్థితి ప్రకారం తుదిజట్టులో సంజూకు చాన్స్ దొరికే అవకాశముంది. హైదరాబాద్ మ్యాచ్‌లో ఇరువురు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబేలతో బరిలోకి దిగింది. బౌలింగ్‌లో జడేజా ఫర్వాలేదనిపించగా. దూబే తేలిపోయాడు. ఇద్దరికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో రెండో టీ20లో దూబే స్థానంలో సంజూ తీసుకునే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇటీవల డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్మురేపి బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన సంజూకు ఆ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఇక విండీస్ సిరీస్‌కు తొలుత తనను పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఓపెనర్ శిఖర్ ధవన్ గాయపడడంతో అతనికి రిప్లేస్‌గా సంజూను తీసుకున్నారు. అయితే ఈ సిరీస్‌లోనూ పాతకథే రిపీట్ అయ్యింది. హైదరాబాద్ మ్యాచ్‌లో సంజూకు మొండిచెయ్యి ఎదురైంది. దీంతో టీమ మేనేజ్‌మెంట్‌కు ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో సంజూ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.









Untitled Document
Advertisements