ప్రస్తుతం ఉన్న టెలికాం రంగంలో ఎయిర్టెల్, జియో నువ్వా నేనా అన్నటుగా సాగుతున్నది .. కానీ నిన్న వోడాఫోన్ ,ఎయిర్టెల్ అపరిమిత కాల్స్ పై ఎలాంటి షరతులు లేవని .. వినియోగదారులు ఎంతైనా మాట్లాడొచ్చని ట్వీట్ చేసింది .. కానీ దీనిపై జియో కాస్త బిన్నంగా స్పందించింది .. సాధారణ వినియోగదారుడి అవసరాల కంటే 5 రెట్లు ఎక్కువగానే తాము అందిస్తున్నామని తెలిపింది. కాబట్టి వినియోగదారుడు అదనంగా చెల్లించాల్సిన అవసరం రాబోదని పేర్కొంది. తమ పోటీదారులతో పోల్చినప్పుడు తమ ప్లాన్లే చౌకగా ఉన్నాయని వెల్లడించింది. ఇతర నెట్వర్క్లకు వర్తించే ఉచిత అవుట్గోయింగ్ కాల్స్పై పరిమితిని తొలగిస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించిన నేపథ్యంలో జియో ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా జియో వినియోగదారులు మల్లి ఎయిర్టెల్ కు పోర్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు ..