రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా జాన్. ఈ సినిమా కోసం ఇటలీలో ఒకప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్లో భారీ సెట్ కూడా వేస్తున్నారు. కారణాలేమిటో తెలియదు కాని ఈ షెడ్యూల్ అనుకున్న సమయానికి ప్రారంభంకాలేదు. అయితే, ఈ షెడ్యూల్ను జనవరి మూడో వారానికి వాయిదా వేశారని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ప్రభాస్ ఇప్పటికే లాంగ్ హాలీడేను ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లిపోయారట. ఎక్కడికి వెళ్లారన్నది మాత్రం సీక్రెట్. ఆయన తిరిగి మళ్లీ జనవరిలో హైదరాబాద్కు వస్తారట. జనవరి 3వ వారంలో మాత్రమే షూటింగ్ ప్రారంభమవుతుందని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కచ్చితంగా చెబుతున్నారు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ప్రభాస్కు 20వ సినిమా.