అరుదైన రికార్డుకు అడుగు దూరంలో!

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 08:10 PM

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో!

భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. చాహల్ మరో వికెట్ పడేస్తే ఇండియా తరపున అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం 52 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సమంగా ఉన్నాడు. 46 మ్యాచ్‌ల్లో అశ్విన్ ఈ మైలురాయిని చేరితే.. చాహల్ మాత్రం కేవలం 35 మ్యాచ్‌ల్లోనే 52 వికెట్లు తీశాడు. రెండోస్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా (42 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు) ఉన్నాడు. నిజానికి హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అత్యంత ప్రభావం చూపిన భారత బౌలర్ చాహలే. కీలకసమయంలో విండీస్ బ్యాట్స్‌మన్ హిట్‌మయర్, కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో విండీస్ అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈక్రమంలో తిరువనంతపురంలో జరిగే రెండో మ్యాచ్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి ఉప్పల్ స్టేడియంలో రాణించిన చాహల్.. స్పిన్నర్లకు అనుకూలించే గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో సత్తాచాటాలని భావిస్తోంది. మరోవైపు మూడు టీ20ల సిరీస్‌లో తొలిమ్యాచ్ నెగ్గి 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవన్‌లో మార్పులుండే అవకాశముంది. లోకల్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






Untitled Document
Advertisements