భారత్‌ 34వ స్థానంలో

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 10:04 AM

మాతృభాష ఇంగ్లీష్‌ కానప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లభాషను విస్తృతంగా మాట్లాడే దేశాల్లో నెదర్లాండ్స్‌ అగ్రస్థానంలో నిలవగా.. భారత్‌ 34వ స్థానంలో నిలిచింది. ఇంగ్లీష్‌మాతృభాష కానీ దేశాల్లో ఇంగ్లీష్‌ బాగా మాట్లాడే ప్రజల సంఖ్య ప్రకారం రూపొందించిన సర్వేలో స్వీడన్‌ రెండోస్థానంలో ఉంది. నార్వే మూడో స్థానంలో నిలిచింది. ఈఎఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫస్ట్‌ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో నిర్వహించిన ఉచిత ఆన్‌ లైన్‌ పరీక్షల ఆధారంగా అక్కడి ప్రజల ఇంగ్లీష్‌ భాష ప్రావీణ్యాన్ని గుర్తించారు.





Untitled Document
Advertisements