‘సరిలేరు నీకెవ్వరు’..ఫ్యామిలీ మెలోడీ

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:52 AM

సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్…’కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్ సోమవారం సాయంత్రం 5:04 గంటలకు విడుదలైంది. ‘సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో… విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో…సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో’ అనే పల్లవితో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీ మెలోడీగా ఉంది. ఎమోషనల్‌గా సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాల బలంగా చాటుతోంది ఈ పాట. ముఖ్యంగా చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలలో రూపొందించిన వీడియో, మహేష్‌బాబు, విజయశాంతి మధ్య వచ్చే సీన్లు, సెట్‌లో టీమ్ చేసే సందడి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన ట్యూన్‌తో పాటను చక్కగా తీర్చిదిద్దారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ క్లాసీ సాంగ్ లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి.ప్రాక్ గానం ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్‌గా ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల కానుంది. మహేష్, రష్మిక మందన్న, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్,లక్ష్మణ్, యుగంధర్.టి, ఎస్.కృష్ణ ప్రధాన సాంకేతిక వర్గం.





Untitled Document
Advertisements