అగ్నిపర్వతం పేలుడు... ఐదుగురు మృతి

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:54 AM

న్యూజిలాండ్ లోని టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన వైట్ ఐలాండ్‌లో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయారు. సోమవారం మధ్యాహ్నం 2.11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. తెల్లని దట్టమైన బూడిద రాశి ఆకాసంలో 3.6 కి.మీ ఎత్తున పైకెగసింది. ఇంకా అగ్ని పర్వతం నుంచి మరింత విస్ఫోటనం వెలువడే ప్రమాదం ఉందని, ఇప్పుడు ద్వీపానికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాన్ టిమ్స్ చెప్పారు. పేలుడు సంభవించినప్పుడు అక్కడ దాదాపు 50 మంది టూరిస్టులు వైట్ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారని పోలీసులు తెలిపారు. రాత్రి అవుతున్న కొద్దీ అక్కడకెళ్లి సహాయక రక్షణ చర్యలు చేపట్టడం ఎంతో రిస్క్ అని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లే అని చెప్పారు.





Untitled Document
Advertisements