ఇండియాలో దెయ్యాలు వెంటాడే రోడ్డు మార్గాలు ఇవి!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 07:19 AM

సాధారణంగా ప్రజలు దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన కధల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు వీటిని కట్టు కధలుగా కొట్టిపారేస్తారు. అయితే కొన్ని సంఘటనలు వీటిపై నమ్మకాలను నేటికీ పెంచుతూనే ఉన్నాయి. చాలా మందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ క్రింద ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువ. అయితే ఈ రోడ్డు మార్గాల్లో ప్రమాదాల వెనుక కారణాలను అన్వేషిస్తే ఎన్నో నమ్మలేని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీరు దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు ఈ జాబితాలో ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో ప్రయాణించడం నివారించడం మంచిది. అసలు ఈ మార్గాలను ఎందుకు భయంకరమైనవిగా పరిగణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

​రాంచి - జంషెడ్ పూర్ (ఎన్ హెచ్ 33)
భారతదేశంలోని ఈ హైవేపై ఊహించని రీతిలో తరచుగా జరిగే ప్రమాదాలు ఏ కారణంగా సంభవిస్తున్నాయో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కొందరు ఇది దెయ్యం చేస్తుందని, కొందరు ఈ రహదారి శపించబడిందని చెబుతారు. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా రెండు దేవాలయాలు ఉంటాయి. వాహనాలను నడిపే వారు ఇక్కడ ఆగి ఈ రెండు ఆలయాలను దర్శించకుండా వెళితే ఈ రోడ్డుపైనే పెద్ద ప్రమాదానికి గురవుతారని చెబుతారు. కొందరు ఈ వాదనతో బలంగా ఏకీభవిస్తారు.

​భంగర్ కోట మార్గం (ఢిల్లీ - జైపూర్ హైవే)
దేశంలోని అత్యంత భయంకర ప్రదేశాల్లో రాజస్థాన్ భంగర్ కోట ఒకటి. దీని కారణంగానే ఢిల్లీ - జైపూర్ రహదారి శపించబడిందని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలా జరగడం వెనుక కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా భంగర్ కోటను దాటే సమయంలో ఏదో తెలియని భయం ఆవహిస్తుందని, విపరీతమైన ఆందోళన కలుగుతుందని ఈ మార్గంలో ప్రయాణించే వారు చెప్పే మాట.

​సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం, తమిళనాడు
తమిళనాడులోని సత్యమంగళ వన్యప్రాణి అభయారణ్యం జాతీయ రహదారి మధ్య విస్తరించి ఉంది. ఇది చాలా నిశ్శబ్ధంగా, భయంకరంగా ఉంటుందని ప్రజలు చెబుతుంటారు. ఈ అడవుల్లోనే బందిపోటు వీరప్పన్ ను పోలీసులు మట్టుపెట్టారు. హైవేపై ఈ ప్రాంతం గుండా వెళ్లినప్పుడు గాలిలో దీపాలు కనిపించడం, ఎవరో గట్టిగా ఆర్తనాదాలు చేయడం జరుగుతుందని చెబుతారు. దీంతో ఇటు వైపు రాత్రి సమయాల్లో ప్రయాణించడం కాస్త భయంకరంగా అనిపిస్తుంది.

​కాషెడి ఘాట్, ముంబై - గోవా హైవే
ఈ రోడ్డులో రక్తం మరిగిన పిశాచులు ఉంటాయని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్లిన చాలా మంది ప్రయాణికులు అవి తమ ముఖంపై, మెడపై, వీపుపై భయంకరంగా గీరాయని చెబుతుంటారు. వారి శరీరంపై ఆ మచ్చలను కూడా చూపిస్తుంటారు. బాధితులు చెప్పిన కధనం ప్రకారం... వారు ఈ రోడ్డులో వెళ్తుండగా ఊహించని విధంగా వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయట. వారి వెంట తీసుకువెళ్తున్న మాంసాహార భోజనం గాలిలోనే అదృశ్యమైందట. అందుకే కాషెడి ఘాట్ రోడ్డులో వెళ్తున్నప్పుడు మాంసాహారాన్ని తీసుకువెళ్లవద్దని సూచిస్తారు.

​ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డు, న్యూ ఢిల్లీ
ఇది కొందరికి గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డులో ప్రయాణించే వారు ఓ తెల్ల చీర కట్టుకున్న మహిళ వింత ఆకారం కనిపించినట్లు చెబుతారు. ఈ రోడ్డుకు సమీపంలో నివసించే వారు దీన్ని బలంగా చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఈ రోడ్డులో భయపడుతూ వాహానాలను నడుపుతుంటారు. ఈ ఆకారాన్ని చూసిన వారు వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోతున్నా అంతే వేగంతో ఆ మహిళ కూడా పరిగెత్తేదని చెబుతారు. నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది కదూ. కానీ ప్రత్యక్ష్యంగా వీక్షించిన వారి మాటల్లో కొంతైనా నిజం ఉండి ఉంటుందేమో.





Untitled Document
Advertisements