పంత్‌కు చూసి ధోనీ అంటూ ఫ్యాన్స్ అరుపులు...ఫ్యాన్స్‌పై కోహ్లీ ఆగ్రహం

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 08:03 AM

ఆదివారం ముగిసిన రెండో టీ20లో అభిమానులపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఐదో ఓవర్ సందర్భంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ నేలపాలు చేయడంతో ఫ్యాన్స్.. ఎంఎస్, ఎంఎస్ అంటూ నినాదాలు చేశారు. అలా అనడం సరికాదని కోహ్లీ వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. వెస్టిండీస్‌తో ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో తేలిపోయిన టీమిండియా మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించింది. అయితే మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ ఫీల్డీంగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌‌లో రెండు క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయి. ఒకటి వాషింగ్టన్ సుందర్ వదిలేయగా.. మరొకటి వికెట్ కీపర్ రిషబ్ పంత్ డ్రాప్ చేశాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ చేసిన అల్లరిపై కోహ్లీ తన సంకేతాలు, సైగల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ ఓవర్‌లో ఎవిన్ లావిస్ షాట్ ఆడగా ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకోగా.. పంత్ దాన్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ ఎంఎస్.. ఎంఎస్ అంటూ ధోనీని గుర్తుకు తెచ్చేలా మైదానమంతా హోరెత్తించారు. ఈక్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వారించాడు. అలాంటి నినదాలు చేయవద్దని సూచించాడు. మరోవైపు సిరీస్ ప్రారంభానికి ముందే పంత్‌ను ధోనీతో పోల్చవద్దని, అతనికి తగినంత సమయమివ్వాల్సిందిగా అందరిని కోహ్లీ కోరిన సంగతి తెలిసిందే. ‘ రిషబ్ పంత్ సామర్థ్యాలపై మాకు నమ్మకముంది. అయితే అతనికి తగినంత సమయమివ్వాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. పంత్ స్టేడియంలో ఏదైన పొరపాట్లు చేసినట్లయితే అతణ్ని ఎద్దేవా చేస్తున్నట్లుగా ఎంఎస్.. ఎంఎస్ అంటూ నినాదాలు చేయడం సరికాదు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏ ప్లేయరైనా కావాలనే పొరపాట్లు చేయడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. అంతేగానీ ఫలానా ప్లేయర్ ఎప్పుడు తప్పు చేసి దొరకుతాడా అని వేచిచూడడం సరికాదు. ఎవరూ కూడా అలా ఆలోచించవద్దు’ అని అంతకుముందు ఇంటర్య్వూలో కోహ్లీ కోరాడు. మరోవైపు రెండో టీ20లో పంత్ బ్యాటింగ్‌లో రాణించాడు. 22 బంతుల్లోనే 33 పరుగులు చేయడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఆదివారం విండీస్ మ్యాచ్ గెలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమయ్యాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 ముంబైలో ఆదివారం జరుగుతుంది.









Untitled Document
Advertisements