అధికారిక ప్రకటన రాకపోయినా పవన్ రీ ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే అనేక వర్గాల నుండి టాక్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలీవుడ్ కోలీవుడ్లలో సూపర్ హిట్ పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. పవన్ మాత్రం రీమేక్ బదులు ఏదైనా స్ట్రయిట్ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. కానీ పవన్ రీఎంట్రీ సినిమాకు దర్శక నిర్మాతలు వీళ్లే అంటూ కొద్ది రోజులుగా గట్టి ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ రీమేక్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ రీమేక్ను పింక్ నిర్మాత బోనీ కపూర్తో కలిసి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. హిందీలో తాప్సీ, తమిళ్లో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రను తెలుగులో సమంత చేయనుందట. పెళ్లి తరువాత ఎక్కువగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తున్న సామ్.. ఈ పాత్రకు ఓకె చెప్పటం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. కోలీవుడ్ సూపర్ హిట్ 96కు రీమేక్గా తెరకెక్కుతున్న సినిమాలో శర్వానంద్కు జోడిగా నటిస్తోంది సమంత. ఈ సినిమా తరువాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ పరిస్థితిల్లో సమంత పింక్ రీమేక్లో నటిస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.