కూతురిని ముక్కలు ముక్కలుగా నరికిన తండ్రి!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 10:18 AM

కూతురిని ముక్కలు ముక్కలుగా నరికిన తండ్రి!

మహారాష్ట్రంలోని థానే కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో లభ్యమైన తల లేని మహిళ మృతదేహం.. పరువుహత్యగా విచారణలో తేలింది. ఓ యువతి వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమెను తండ్రి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి బ్యాగ్ నుంచి వాసన వస్తుండడంతో ఆటో డ్రైవర్ అనుమానించి ప్రశ్నించడంతో ప్రయాణికుడు పారిపోయాడు. ఆ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్యాగులో ముక్కలు ముక్కులు నరికిన మహిళ మృతదేహం కనిపించింది. ఆ నిందితుడు తిత్వాల నుంచి లోకల్ రైలులో కల్యాణ్ స్టేషన్‌కు చేరుకున్నట్టు సిసి టివి ఫుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. అరవింద్ తీవారి (47) అనే వ్యక్తికి 22 ఏళ్ల కూతురు ప్రిన్సి ఉంది. ప్రిన్సి కాల్ సెంటర్ లో పని చేస్తుందని అక్కడే ఉన్న వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని, కులాంతర వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో గొడవకు దిగింది. దీంతో తన భార్య, ముగ్గురు కూతుళ్లు ఉత్తర ప్రదేశ్ వెళ్లినప్పుడు కూతురుకు విషమిచ్చి తండ్రి చంపాడు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లితే ఇబ్బందులు కలుగుతాయని భావించిన తండ్రి తన కూతురిని ముక్కలు ముక్కలుగా నరికి బ్యాగ్‌లో పెట్టుకొని లోకల్ రైళ్లో కల్యాణ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు అర్వింద్ తివారీని అరెస్టు చేశామని డిసిపి దీపక్ దీయోరాజ్ తెలిపాడు.





Untitled Document
Advertisements