కిల్లర్ చైర్....200 ఏళ్లలో లెక్కలేనన్ని హత్యలు చేసింది!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:46 PM

కిల్లర్ చైర్....200 ఏళ్లలో లెక్కలేనన్ని హత్యలు చేసింది!

ఆ కుర్చీలో కూర్చోవడమే కాదు దాన్ని తాకినా మరణాన్ని కొని తెచ్చుకున్నట్టే. అందుకే దీన్ని అంతా ‘డెత్ ఛైర్’ అంటారు. ఓ వ్యక్తి ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ కూర్చి.. అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. కొన్ని దశబ్దాలుగా 200 మంది ఈ కూర్చీ వల్లే చనిపోయారంటే నమ్మబుద్ధి కాదు. కానీ, చరిత్రాక సాక్ష్యాలను నమ్మక తప్పదు. మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగేవో ఎవరికీ తెలియలేదు. కాలక్రమేనా.. అసలు నిజం తెలిసింది. అది సాధారణ కూర్చీ కాదని, ఓ వ్యక్తి ఆత్మ అని తెలుసుకున్నారు. చివరికి దాన్ని ఓ మ్యూజియానికి అప్పగించారు. అందులో ఎవరైనా కూర్చుంటారనే భయంతో దాన్ని గోడకు వేలాడి దీశారు. ఆ కూర్చీని ముట్టుకుని ప్రమాదం కొనితెచ్చుకోవద్దంటూ ఆ దాని చరిత్రను సైతం అక్కడ రాసి ఉంచారు. అసలు ఎవరిదా కూర్చీ? అది మనుషులను ఎందుకు చంపుతోందంటే...అది 1600 సంవత్సరం.. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లోని త్రిస్క్ అనే ప్రాంతం ఉంది. సాంప్రదాయ మార్కెట్లకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఈ ప్రాంతం నార్త్ యార్క్ మూర్స్, యార్క్‌షైర్ డలేస్ మధ్య ఉంది. అక్కడ డానియల్ ఔటీ అనే చిల్లర దొంగ ఉండేవాడు. అతడి కుమార్తె ఎలిజిబెగ్ ఔటీ స్థానిక యువకుడు థామస్ బస్బేను పెల్లి చేసుకుంది. బస్బే కూడా డానియల్‌తో కలిసి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. బస్బేకు, భార్య ఎలిజబెత్‌కు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తండ్రి డానియల్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేందుకు కూతురి దగ్గరకు వచ్చాడు. బస్బే ఇంటికి వచ్చేసరికి తనకు ఇష్టమైన కూర్చీలో కూర్చున్న డానియల్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గొడపడ్డారు. వారిద్దరిని విడిపించేందుకు ఎలిజబెత్ విశ్వప్రయత్నం చేసింది. చివరికి డానియల్ కూతురిని తన వెంట తీసుకెళ్లకుండానే వెనుతిరిగాడు. అప్పటికీ డానియల్‌కు కోపం తగ్గలేదు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఫామ్ హౌస్‌కు రావాలని, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని బస్బే డానియల్‌కు కబురు చేశాడు. అక్కడికి చేరిన డానియల్‌ను బస్బే సుత్తితో తలను పగలగొట్టి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఎలిజబెత్ ఇంట్లోని ఫర్నీచర్‌ను ఓ హోటల్‌కు ఇచ్చేసింది. అందులో బస్బే ఇష్టపడే కూర్చీ కూడా ఉంది. ఈ ఘటన 1706లో చోటుచేసుకుంది. డానియల్‌ను హత్య చేసింది బస్బే అని నిరూపణ కావడంతో కోర్టు అతడికి ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష అమలు సమయంలో బస్బే చివరిగా ఓ కోరిక తీర్చాలని కోరాడు. మరణానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన కూర్చీలో కూర్చుంటానని చెప్పాడు. దీంతో అతన్ని ఉరి తీయడానికి ముందు ఆ హోటల్‌కు తీసుకెళ్లారు. బస్బే తన కూర్చీలో కాసేపు కూర్చొని.. భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అతడిని ఆ హోటల్‌కు సమీపంలో ఉన్న ఉరి తీశారు. ఈ ఘటనతో బస్బే పేరు మారుమ్రోగింది. అంతా ఆ హోటల్‌ను బస్బే హోటల్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆ హోటల్ యాజమాన్యం ఆ పేరును సొమ్ము చేసుకోవాలని భావించింది. ఆ హోటల్ పేరును ‘ద బాస్బే స్టూప్ ఇన్’ అని మార్చింది. అతడు ఉరి వేసుకోడానికి ముందు కూర్చున్న కూర్చీ తమ హోటల్‌లోనే ఉందంటూ ప్రచారం చేసింది. ఊహించినట్లే అంతా ఆ హోటల్‌కు వచ్చి ఆ కూర్చీని చూడటం మొదలుపెట్టారు. అందులో కూర్చొని తాము బస్బే కూర్చీలో కూర్చున్నామని గొప్పగా చెప్పుకొనేవారు. కానీ, వారిలో ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. ఆ కూర్చీలో కూర్చున్న వ్యక్తులు వేర్వేరు కారణాలతో చనిపోయేవారు. కొన్నాళ్లు ఆ మరణాల వెనుక కారణాలేమిటనేది తెలియలేదు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. కొంతమంది సైనికులు ఆ హోటల్‌లోనే తలదాచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఆ బస్బే కూర్చీలో కూర్చొన్నారు. ఆ తర్వాత రోజే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని భావించారు. కానీ, అసలు విషయం తెలుసుకోలేకపోయారు. ఆ హోటల్‌లో అదనంగా పబ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ కూర్చీని పబ్‌లోకి చేర్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆ కూర్చీలో కూర్చొని మందు తాగాడు. ఉదయం చూసేసరికి అతడు ఓ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు. తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. కానీ, కొందరు మాత్రం.. ఇది తప్పకుండా ఆ కూర్చీ పనే కావచ్చని అనుమానించారు. ఈ ప్రచారం మరో విధంగా హోటల్‌కు లాభం చేకూర్చింది. ఆ కూర్చితో కొందరూ ‘డేర్’ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు ఆ కూర్చీలో కూర్చోడానికి పోటీపడ్డారు. చివరికి వారిద్దరి కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అక్కడితో ఆ మరణాలు ఆగలేదు. స్థానికులు కూడా ఆ కూర్చి వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే అపవాదును ఆ హోటల్‌పై వేయడం మొదలుపెట్టారు. దీంతో హోటల్ భవన యజమాని టోనీ ఎర్న్‌షా ఇకపై అందులో ఎవరూ కూర్చోకూడదని దాన్ని సెల్లార్‌లో పెట్టారు. అయితే, ఓ రోజు హోటల్‌కు సామాన్లు తీసుకొచ్చిన డెలివరీ డ్రైవర్.. సెల్లార్‌లో సామాన్లు పెట్టి అందులో కూర్చున్నాడు. కొన్ని గంటల తర్వాత అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎర్న్‌షా ఆ కూర్చుని స్థానిక త్రిస్క్ మ్యూజియానికి అప్పగించాడు. ఆ కూర్చిని నేలపై ఉంచితే ఎవరైనా కూర్చొనే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో దాన్ని గోడకు వేలాడ దీశారు. అది ఎంత ప్రమాదకరమో తెలుపుతూ ఓ కథనాన్ని ఉంచారు. కనీసం ఆ కూర్చిని ముట్టుకొనేందుకు కూడా ప్రయత్నించవద్దని అందులో రాశారు. ఆ కూర్చీలో కూర్చున్నవారు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకొనేందుకు ఫర్నీచర్ హిస్టోరియన్ డాక్టర్ ఆడమ్ బావెట్ రంగంలోకి దిగారు. మ్యూజియంలో ఉన్న ఆ కూర్చీ బెస్బే ఉరి సమయంలో కూర్చున్నది కాదని తెలిపారు. అది సుమారు 138 ఏళ్ల కిందటిదని, సుమారు 1840లో దాన్ని తయారు చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. మరి, అది నిజమైన బెస్బే కూర్చీ కాకపోయి ఉంటే.. ఎవరిది? బెస్బే కూర్చున్న కూర్చీ ఎక్కడ ఉంది? హోటల్ నిర్వాహకులు అసలు కూర్చీని మరెక్కడైనా దాచిపెట్టారా? వంటి అనుమానాలెన్నో వ్యక్తమవుతున్నాయి.




















Untitled Document
Advertisements