‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ '

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:48 PM

ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ దేశంలో అత్యంత విలువైన ట్వీట్ గా ఈ ఏడాది నిలిచింది. ఈ మేరకు ట్విట్టర్ ఒక ప్రకటన చేసింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా మోదీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ (ఇవన్నీ కలిస్తే) = విజయీ భారత్(విజయ భారత్) అంటూ ఇచ్చిన నినాదం సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్లో ప్రజల ఆదరణను చూరగొంది. ఈ ట్వీట్ ను భారత్ ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’ గా ట్విట్టర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ట్వీట్ కు నాలుగు లక్షల ఇరవై వేల లైక్ లు రాగా, లక్షా పదిహేడువేలకు పైగా రీట్వీట్లు నమోదయ్యాయి.





Untitled Document
Advertisements