సౌత్ నుంచి వీరిద్దరే!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 09:05 PM

సౌత్ నుంచి వీరిద్దరే!

సినిమా హీరోలకు అభిమానులకు మధ్య ఒకప్పుడు చాలా దూరం ఉండేది. కాని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని తారలు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. బోలెడన్ని విషయాలను వారితో షేర్ చేసుకుంటున్నారు. అయితే, వెండితెరపై ఉన్నట్టే సోషల్ మీడియాలో సైతం హీరోల మధ్య గట్టి పోటీనే ఉంది. సెలబ్రిటీలు ప్రధానంగా వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్. దీని ద్వారానే ఎప్పటికప్పుడు తమ సినిమాలకు, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అయితే, ఈ ట్వీట్లను ఆధారంగా చేసుకుని ట్విట్టర్ ఇండియా ప్రతి ఏటా ఒక రిపోర్ట్‌ను విడుదల చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన రిపోర్ట్‌ను మంగళవారం ప్రకటించింది. ఎంటర్‌టైన్మెంట్ విభాగం నుంచి 2019లో దేశంలో అత్యధిక ట్వీట్లు చేసిన నటులు, నటీమణుల టాప్ 10 ట్విట్టర్ హ్యాండిల్స్‌ను పేర్కొంది. ‘‘టాప్ ఎంటర్‌టైన్మెంట్ హ్యాండిల్స్ ఇన్ ఇండియా - మేల్’’ కేటగిరీలో సౌత్ నుంచి నలుగురు సెలబ్రిటీలు స్థానం సంపాదించుకున్నారు. ఆ నలుగురు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, దళపతి విజయ్, సంగీత దిగ్గజం ఎ.ఆర్.రెహమాన్, దర్శకుడు అట్లీ. విజయ్ ఐదో స్థానంలో ఉండగా.. మహేష్ బాబు తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇక రెహమాన్ ఆరో స్థానం, అట్లీ పదో స్థానాన్ని ఆక్రమించారు. ఈ ఛార్ట్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలు ఆక్రమించారు. రణ్‌వీర్ సింగ్ ఏడు, అజయ్ దేవగణ్ ఎనిమిది స్థానాల్లో నిలిచారు. అలాగే, ‘‘టాప్ ఎంటర్‌టైన్మెంట్ హ్యాండిల్స్ ఇన్ ఇండియా - ఫీమేల్’’ కేటగిరీలో సౌత్ నుంచి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ స్థానం దక్కించుకున్నారు. కాజల్ ఏడో స్థానంలో, రకుల్ 10వ స్థానంలో ఉన్నారు. ఈ కేటగిరీలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాది అగ్రస్థానం. అనుష్క శర్మ, లతా మంగేష్కర్, అర్చన కల్పతి, ప్రియాంక చోప్రా, అలియా భట్, సన్నీ లియోన్, మాధురి దీక్షిత్ ఈ జాబితాలో ఇతర సెలబ్రిటీలు.







Untitled Document
Advertisements