టాటా టెలి సర్వీసెస్ ఎండి ఎన్.శ్రీనాథ్ టాటా ట్రస్ట్ సిఇఒ రేసులోముందు వరుసలో ఉన్నారు. ఈ మేరకు సంస్థకు చెందిన ఒక అధికారి మీడియా తెలిపారు. రతన్ టాటాకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా కూడా పని చేసిన శ్రీనాథ్(57) వచ్చే ఏడాది కొత్త పాత్ర పోషించే అవకాశముందని అంటున్నారు. పలు న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటున్న టాటా ట్రస్ట్కు సిఇఒ నియామకం కోసం గత ఎనిమిది నెలలుగా సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి టాటా ట్రస్ట్ సిఇఒ ఎంపిక పూర్తి కావొచ్చని తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో టాటా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.వెంకటరామన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.