పౌరసత్వ బిల్లుపై నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 11:40 AM

పౌరసత్వ బిల్లుపై నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

ఇండియాలోని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలకు, పాకిస్థాన్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకూ తేడా లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన, గురించి ప్రస్తావించారు. నేడు రాజ్యసభకు బిల్లు రానుండగా, ఈ బిల్ దేశ భవిష్యత్ కు దిశా నిర్దేశంగా నిలుస్తుందని అన్నారు.

ఈ బిల్ తో నష్టం అధికమని పాకిస్థాన్ చెబుతోందని గుర్తు చేస్తూ, పక్క దేశాల వ్యవహారాలపై వారికి అవసరం ఏంటని ప్రశ్నించారు. పాక్ నేతలు మాట్లాడుతున్నట్టుగానే, కొన్ని పార్టీలు కామెంట్లు చేస్తున్నాయని మోదీ అన్నారు. ఈ బిల్ ను ప్రవేశపెట్టాలన్నది తమ మేనిఫెస్టోలోనే ఉందని, ఇచ్చిన హామీని ఇప్పుడు అమలులోకి తీసుకుని వస్తున్నామని ఆయన అన్నారు. కాగా, పౌరసత్వ బిల్ నేటి మధ్యాహ్నం తరువాత రాజ్యసభ ముందుకు రానుండగా, తమ ఎంపీలకు కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements