మూడో టీ20...ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:43 PM

మూడో టీ20...ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్

వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. స్పిన్నర్లు చాహల్, జడేజాలపై వేటు వేసిన కోహ్లీ.. వారి స్థానాల్లో మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఉప్పల్ టీ20లో టీమిండియా గెలుపొందగా.. తిరువనంతపురం మ్యాచ్‌లో కరీబియన్లు గెలుపొందారు. దీంతో.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు గెలుస్తున్న టీమిండియాకి విజేత నిర్ణయాత్మక మ్యాచ్‌ల్లో మెరుగైన రికార్డ్ ఉంది. దానికి తోడు వాంఖడే పిచ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శివమ్ దూబేకి మంచి అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. భారత ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా రెండు టీ20ల్లోనూ విఫలమవగా.. ఉప్పల్ టీ20లో రాణించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రెండో టీ20లో నిరాశపరిచారు. కానీ.. ఆల్‌రౌండర్ శివమ్ దూబే మెరుపు హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకోవడం భారత్‌కి గొప్ప ఉపశమనం. కానీ.. బౌలింగ్‌లో మాత్రం దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ తేలిపోతుండటం టీమ్‌లో కంగారు పెంచుతోంది. వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ ఎవిన్ లావిస్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటుండగా.. రెండో టీ20లో హాఫ్ సెంచరీతో సిమన్స్ కూడా ఫామ్ అందుకున్నాడు. ఇక కెప్టెన్ కీరన్ పొలార్డ్, హిట్టర్ నికోలస్ పూరన్‌లకి వాంఖడే పిచ్‌పై మంచి అవగాహన ఉంది. ఎవిన్ లావిస్ కూడా ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కి ఆడటం ద్వారా ఆ స్టేడియంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. బౌలింగ్‌లో విలియమ్స్, వాల్ష్ మంచి ఊపుమీదున్నారు. ముఖ్యంగా.. కోహ్లి వికెట్ పడగొట్టిన విలియమ్స్.. ఆ జట్టు బౌలింగ్‌ విభాగంలో ఉత్సాహం నింపాడు.

India (Playing XI): Rohit Sharma, Lokesh Rahul, Virat Kohli(c), Rishabh Pant(w), Shreyas Iyer, Shivam Dube, Washington Sundar, Bhuvneshwar Kumar, Kuldeep Yadav, Deepak Chahar, Mohammed Shami.

West Indies (Playing XI): Lendl Simmons, Evin Lewis, Brandon King, Shimron Hetmyer, Nicholas Pooran(w), Kieron Pollard(c), Jason Holder, Khary Pierre, Hayden Walsh, Sheldon Cottrell, Kesrick Williams.





Untitled Document
Advertisements