భారత్ లో ఒకే ఒక్కడు...రోహిత్ @400 సిక్సర్లు

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:46 PM

భారత్ లో ఒకే ఒక్కడు...రోహిత్ @400 సిక్సర్లు

భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో వాంఖడే వేదికగా విండీస్ తో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ వేసిన ఫాస్ట్ బౌలర్ కాట్రెల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. వరల్డ్ క్రికెట్‌లో ఇప్పటి వరకూ క్రిస్‌గేల్, అఫ్రిది మాత్రమే ఈ 400 సిక్సర్ల మార్క్‌ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్‌గేల్ 462 మ్యాచ్‌ల్లో 534 సిక్సర్లు నమోదు చేయగా.. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా 354వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ 400 సిక్సర్లతో మూడో స్థానానికి ఎగబాకాడు. సుదీర్ఘ కెరీర్‌లో 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 232 సిక్సర్లు, 104 టీ20ల్లో 116 సిక్సర్లు, 32 టెస్టుల్లో 52 సిక్సర్లు నమోదు చేశాడు. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మహేంద్రసింగ్ ధోని 359 సిక్సర్లు (538 మ్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ 264 సిక్సర్లు (664 మ్యాచ్‌ల్లో) టాప్ -3లో కొనసాగుతున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 398 మ్యాచ్‌ల్లో 206 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.









Untitled Document
Advertisements