విలియమ్స్‌పై 2-1తో విరాట్ కోహ్లీ ఆధిపత్యం షురూ...!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:53 PM

విలియమ్స్‌పై 2-1తో విరాట్ కోహ్లీ ఆధిపత్యం షురూ...!

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ బుధవారం రాత్రి ముగిసింది. ఈ మ్యాచ్‌‌లో కేఎల్ రాహుల్ (91: 56 బంతుల్లో 9x4, 4x6), రోహిత్ శర్మ (71: 34 బంతుల్లో 6x4, 5x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (70 నాటౌట్: 29 బంతుల్లో 4x4, 7x6) చెలరేగడంతో 240 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టుని 173/8కే కట్టడి చేసేసింది. మ్యాచ్‌కే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలవగా.. తన ప్రియమైన ప్రత్యర్థి, పేసర్ విలియమ్స్ బౌలింగ్‌ని ఉతికారేసిన కోహ్లీ మరోసారి పైచేయి సాధించాడు. ఉప్పల్ టీ20 కోహ్లీ, తిరువనంతపురం టీ20లో విలియమ్స్ పైచేయి సాధించడంతో ఆధిపత్య పోరు సమమైంది. దీంతో.. వాంఖడే టీ20లో ఎవరు పైచేయి సాధిస్తారు..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. క్రీజులోకి ఆలస్యంగా (13వ ఓవర్‌లో) వచ్చినా విరాట్ కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్‌తో అభిమానుల్ని అలరించాడు. ముఖ్యంగా.. విలియమ్స్ బౌలింగ్‌లో తొలుత ఓ రెండు మూడు బంతుల్ని ఆచితూచి ఆడిన కోహ్లీ.. నీకు ఉందిలే.. వెయిట్ చెయ్ అనే తరహాలో సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి అతని బౌలింగ్‌ని ఊచకోత కోశాడు. విలియమ్స్ బౌలింగ్‌‌లో సిక్స్ బాదిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రీతిలో కోహ్లీ చేసుకున్న సంబరాలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. వెస్టిండీస్‌తో ఆఖరి టీ20లోనూ రిషబ్ పంత్ ఫెయిలయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీకి బదులుగా ఫస్ట్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఎదుర్కొన్న రెండో బంతినే గాల్లోకి లేపేసి డకౌటయ్యాడు. దీంతో.. అతడికి ఇంకెన్ని అవకాశాలిస్తారంటూ అభిమానులు సీరియస్‌గా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. అతనిపై విపరీతంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మొత్తంగా మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో భారత్ జట్టు దక్కించుకోగా.. ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.





Untitled Document
Advertisements