కప్ చేతికిచ్చినంత మాత్రాన మర్చిపోరు! కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:11 PM

కప్ చేతికిచ్చినంత మాత్రాన మర్చిపోరు! కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !

వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో సంజు శాంసన్ ని తీసుకుంటే బాగుంటుందని యావత్ దేశం అభిప్రాయపడింది. అయినప్పటికే కోహ్లి మాత్రం ఎక్కడా తగ్గకుండా పంత్ కే సపోర్ట్ చేసాడు. మరోపక్క టైటిల్ ఇచ్చేసరికి మాత్రం కోహ్లి శాంసన్ చేతిలో కప్పు పెట్టి ఆ మచ్చను తుడుచుకోవాలి అనుకున్నాడు. ఈ మేరకు స్వయంగా అతడే ఇంస్టా ఎకౌంట్ లో పిక్స్ కూడా పెట్టాడు. దాంతో నెటీజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.





Untitled Document
Advertisements