మరో రెండు బడ్జెట్ ప్లాన్లల్లో మార్పులు?!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 08:07 PM

మరో రెండు బడ్జెట్ ప్లాన్లల్లో మార్పులు?!

ప్రముఖ టెలికాం సంస్థ రిలియన్స్ జియో క్రమంగా తన ప్లాన్లకు మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రూ.98, రూ.149 ప్లాన్లకు కూడా మార్పులు చేసింది. అయితే ఈ సారి ప్లాన్లకు సంబంధించిన లాభాలను తగ్గించకుండా పెంచింది. ఇప్పుడు మీరు రూ.98 ద్వారా రీచార్జ్ చేసుకుంటే 2 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 300 ఉచిత ఎస్ఎంఎస్ లు అందించనున్నారు. వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవాలంటే ఐయూసీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పై లాభాలతో పాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలంటే మీరు జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ లో Affordable plans పేజీలోకి వెళ్లాలి. అదే రూ.149 ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకున్నట్లయితే.. మీకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 300 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఆ తర్వాత ఐయూసీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలంటే జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ లో 1 GB/Day పేజీలోకి వెళ్లాలి. జియో మెల్లమెల్లగా తన ప్లాన్లన్నిటికీ మార్పులు చేసుకుంటూ వస్తుంది. గత వారంలోనే జియో తన ప్లాన్లను 40 శాతం వరకు పెంచింది. ఈ రూ.149 ప్లాన్ అయితే నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు సార్లు మార్పులకు లోనైంది. కేవలం జియోనే కాకుండా ఎయిర్ టెల్, వొడాఫోన్ లు కూడా డిసెంబర్ 3 నుంచి పెంచిన రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మూడేళ్ల క్రితం జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆకాశంలో ఉన్న ప్లాన్ల ధరలు ఒక్కసారి అందుబాటులోకి దిగి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ టెలికాం చార్జీలు ఆ స్థాయికి వెళతాయేమో అనిపిస్తుంది.







Untitled Document
Advertisements