ద్రౌపదికి ఐదుగురు భర్తలను ప్రసాదించిన శివుడు!

     Written by : smtv Desk | Mon, Dec 16, 2019, 05:08 AM

ద్రౌపదికి ఐదుగురు భర్తలను ప్రసాదించిన శివుడు!

కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరుకుంటుండగా యుద్ధం వల్ల కలిగిన పర్యవసానానికి ద్రౌపది విచారిస్తూ ఈ మారణహోమంలో తన పాత్రను గురించి ఆత్మపరిశీలన చేసుకుంది. దీనికి ముందురోజు ఉదయం నిద్రపోతున్న ద్రౌపదికి ఉప పాండవులను అశ్వత్థాముడు సంహరించిన విషయం నకులుడు తెలియజేశాడు. తన కుమారుల మరణ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో విగతజీవులుగా పడి ఉన్న సోదరుడు, పుత్రులలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపం కూడా కలిగింది. తన పుత్రులను సంహరించిన అశ్వత్థామను హతమార్చమని పాండవులను నిలదీసింది. పాండవులో చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ద్రౌపది కోపం చల్లబడింది. తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరింది. కర్ణుడు తన జ్యేష్ఠ పుత్రుడనే సత్యాన్ని కుంతి చెప్పడంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోతారు. అద్భుత దానశీలుడిగా, విశిష్ట వ్యక్తిగా కీర్తి పొందిన కర్ణుడు తమ సోదరుడని తెలియగానే పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కలగడంతో అతడ్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకుంది. ద్రౌపదికి తన జీవనపథంపై, వివాహంపైన ఉన్న ధర్మశంకలను, సందేహాలను వ్యాసుడు, కృష్ణుభగవానుడు తీర్చారు. పూర్వ జన్మలలో వేదవతిగా, ఆ తరువాత మౌద్గల్య మహర్షి భార్య ఇంద్రసేనగా, ఆ తరువాతి జన్మలో కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఆమె చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలకడంతో ఐదుగురు భర్తలను శివుడు అనుగ్రహించాడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరని, కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించడానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించడానికి అవసరమైన శుశ్రూషాభావం, కన్యత్వం, సౌభాగ్యాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ద్రోణుడి చేతిలో అవమానం ఎదుర్కొన్న ద్రుపదుడు, తనకు అర్జునుడి లాంటి తనయుడు కావాలని యజ్ఞం చేశాడు. ఈ సమయంలో ద్రుపదుడికి అగ్నిగుండంలో ద్రౌపది లభించింది. కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలలన్న తలంపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట తెలుసుకుని, స్వయంవరం ప్రకటించాడు. దుర్యోధనుడి కుట్ర నుంచి క్షేమంగా బయటపడిన పాండవులు ద్రౌపది స్వయంవరానికి రావడం, అక్కడ పార్థుడు మత్స్య యంత్రాన్ని చేధించి గెలిచాడు. ద్రౌపదిని స్వయంవరంలో గెలిచిన పాండవులు తమ తల్లి కుంతితో అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమెను సోదరులందరూ పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి.





Untitled Document
Advertisements