కారు నడుపుతూ సెల్ఫీ వీడియో..నోటీసులు పంపిన ట్రాఫిక్ పోలీసులు

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 01:50 PM

కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న నటి సంజనకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నోటీసులు పంపడమేకాక, విచారణకు హాజరు కావాలని కోరడంతో సంజన హతాశురాలైంది. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సెల్ఫీ తీసుకుంటే నేరమా? అని ప్రశ్నిస్తోంది. మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని చూడటానికి వెళ్లిన సంజన తిరుగు ప్రయాణంలో కారు డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని.. దాన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా పెట్టింది. ఈ వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెకు నోటీసులు పంపారు.





Untitled Document
Advertisements