ఘనంగా గంగాసాగర్ మేళా

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 03:57 PM

పశ్చిమ బెంగాల్లో గంగాసాగర్ మేళా ఘనంగా ప్రారంభమయ్యింది. మకర సంక్రాతి సందర్భంగా పవిత్ర పుణ్య స్నానాలు చేసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భదత్రను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. హెలీకాప్టర్, డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. మేళాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడు మేళాకు వచ్చే భక్తులకు దీదీ సర్కార్‌ బీమా సౌకర్యం కల్పించింది.





Untitled Document
Advertisements