దమ్ముంటే చర్చకు రా…

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 09:06 AM

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నాయకులు ఒకరి ఫై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెరాస ప్రభుత్వం ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు గానూ, స్థానిక తెరాస ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా స్పందించారు. ఎంపీ అరవింద్ కు దమ్ముంటే అభివృద్ధి ఫై చర్చించేందుకు రావాలని సవాల్ విసిరారు.

అయితే ధర్మపురి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ ఇలా అన్నారు. నిజామాబాద్ మేయర్ సీటుని కేసీఆర్ ఎంఐఎం కి ఇచ్చేందుకు రెడీ అయ్యారని ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలని తప్పుబట్టారు. అంతేకాకుండా పరోక్షంగా తెరాస గెలుపుని ఖాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే స్థానిక మేయర్ తెరాస పార్టీ కార్పోరేటర్ అవుతారని వ్యాఖ్యలు చేసారు. ఎంఐఎం కి ఇచ్చే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు.





Untitled Document
Advertisements