స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బన్నీ కెరిర్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను నమోదు చేసుకుంటున్నాడు.
అయితే ఇదే సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా నేడు వరంగల్లో విజయోత్సవ వేడుకలను జరుపుకుంది. మహేశ్ సినిమాకి పోటీగా సంక్రాంతి బరిలో నిలిచి విన్నర్గా నిలిచిన అలవైకుంఠపురంలో సినిమా విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది. అందులోనే భాగంగా వైజాగ్లో ఈ సక్సెస్ వేడుకను నిర్వహించబోతుంది. జనవరి 19వ తేదిన సాయంత్రం సాగర తీరాన సక్సెస్ వేడకలకు సిద్దం కాబోతుంది అలవైకుంఠపురంలో బృందం.