ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి, పరారీలో ఉన్న డాక్టర్ బాంబ్ అలియాస్ జలీస్ అన్సారీ(68)ని తాజాగా కాన్పూర్ పోలీసులు పట్టేసుకున్నరు. శుక్రవారం సాయంత్రం అన్సారీని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బాంబు పేలుళ్ల కేసులో కోర్టు జీవిత ఖైదు విధించడంతో అన్సారీని రాజస్థాన్ జైలుకు తరలించారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో అన్సారీ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నడు. కోర్టు ఆయనకు 21 రోజుల పెరోల్గ్రాంట్ చేసింది. దీంతో జైలు బయట అడుగుపెట్టిన అన్సారీ.. సొంతూరికి వెళ్లి తన కుటుంబంతో కాలం గడిపాడు. ఈ నెల 17న పెరోల్ గడువు ముగిశాక తిరిగి రావాల్సిన అన్సారీ.. శుక్రవారం ఉదయమే ఇంట్లోంచి బయటపడ్డాడు. ఆ తర్వాత అన్సారీ ఆచూకీ తెలియడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో అన్సారీ పరారీలో ఉన్నాడని ప్రకటించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు వింగ్ పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.