పాక్ పర్యటన: క్రికెట్‌ కంటే ప్రాణం ముఖ్యమని స్పష్టం!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 05:14 PM

పాక్ పర్యటన: క్రికెట్‌ కంటే ప్రాణం ముఖ్యమని స్పష్టం!

పాకిస్థాన్‌‌లో పర్యటన అనగానే క్రికెటర్లు కాస్త వెనకడుగేస్తున్నారు. పాక్ లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు నిరాకరిస్తున్నారు. అక్కడ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి లేఖ రాసిన ముష్ఫికర్ రహీమ్.. క్రికెట్‌ కంటే తనకి ప్రాణం ముఖ్యమని స్పష్టం చేశాడు. దీంతో.. అతని బాటలోనే మరికొంత మంది క్రికెటర్లు పయనించే అవకాశం ఉంది. జనవరి 14 నుంచి మూడు టీ20లు, ఒక వన్డే, రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్థాన్ గడ్డపై బంగ్లా, పాక్‌ టీమ్‌లు ఆడేలా షెడ్యూల్‌ రూపొందించారు. కానీ.. ఈ సిరీస్‌కి తాను దూరంగా ఉండనున్నట్లు లేఖలో రహీమ్ స్పష్టం చేశాడు. ‘పాకిస్థాన్‌లో భద్రతపై మా ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే నేను పాక్ పర్యటనకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. గతంలో కంటే పాక్‌లో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ.. క్రికెట్‌ కంటే జీవితం ముఖ్యం కదా..? పాక్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంటాయి. సిరీస్‌ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవడం కష్టమే. కానీ.. తప్పట్లేదు’ అని వెల్లడించాడు. 2009లో లాహోర్‌లో మ్యాచ్‌ ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు బస్సులో ప్రయాణిస్తుండగా.. వారిపై ఉగ్రదాడి జరిగింది. దీంతో.. అప్పట్లో ఆ జట్టులోని చాలా మంది క్రికెటర్లకి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై పర్యటించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. గత ఏడాది చివర్లో మళ్లీ శ్రీలంక జట్టు.. పాక్‌లో పర్యటించినా.. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.





Untitled Document
Advertisements