IND vs AUS 3rd ODI: రికార్డుల ముంగిట టీంఇండియా

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 06:13 PM

IND vs AUS 3rd ODI: రికార్డుల ముంగిట టీంఇండియా

ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించడంతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఈక్రమంలో అందరి ఫోకస్ బెంగళూరులో ఆదివారం జరిగే మూడో వన్డేపై ఉంది. ఈ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో రోహిత్ శర్మ వన్డేల్లో డబుల్ సెంచరీని కూడా నమోదు చేశాడు. ఈక్రమంలో మూడో వన్డేకు ముందు ఇరుజట్ల మధ్య కీలక స్టాటిస్టిక్స్ తెలుసుకుందాం.. ఈ స్టేడియంలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపోటముల వివరాలు. మొత్తం ఏడు మ్యాచ్‌లాడగా.. నాల్గింటిలో ఇండియా, రెండింటిలో ఆసీస్ నెగ్గింది. ఒకమ్యాచ్‌లో ఫలితం రాలేదు. చివరిసారిగా 2017లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. 12.6- బెంగళూరులో విరాట్ కోహ్లీకి ఏమాత్రం మంచి రికార్డు లేదు. ఐపీఎల్లో సొంతగడ్డ అయినటువంటి చిన్న స్వామి స్టేడియంలో వన్డేల్లో మాత్రం కోహ్లీ తేలిపోయాడు. ఇక్కడ ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం 63 పరుగులే చేశాడు. బెంగళూరు, చెన్నైలలో మాత్రమే కోహ్లీ ఒకటి కంటే ఎక్కువ సార్లు డకౌటయ్యాడు. 66.67- 2016 నుంచి వన్డే డిసైడర్ మ్యాచ్‌ల్లో కోహ్లీ సగటు. గత ఆరు మ్యాచ్‌ల్లో తను 400 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అవి వరుసగా 65,113, 71, 46, 20, 85 కావడం విశేషం. 53.46- ఇప్పటివరకు ఆడిన 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ (డిసైడర్)లలో రోహిత్ సగటు. తొలుత బ్యాటింగ్ చేసిన నాలుగు వన్డేల్లో 428 పరగులు చేశాడు. సగటు 107 కావడం విశేషం. ఇందులో 209 సహా రెండు సెంచరీలు ఉన్నాయి. అయితే ఛేజింగ్‌లో బ్యాటింగ్ చేసిన మిగతా ఏడు డిసెడర్ మ్యాచ్‌ల్లో రోహిత్ కేవలం 22.86 సగటును మాత్రమే నమోదు చేశాడు. ఇందులో రెండు ఫిఫ్టీలున్నాయి. అయితే ఈ రెండు అర్ధసెంచరీలు ఆఖరి రెండు సిరీస్‌లలో వచ్చినవే కావడం విశేషం. 106- చిన్నస్వామి స్టేడియంలో వన్డేల్లో రోహిత్ బ్యాటింగ్ సగటు. ఇక్కడ మూడు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్..318 పరుగులు సాధించాడు. 2017, 2013లలో వరుసగా 65, 209 పరుగులు సాధించాడు. 2010లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు చేశాడు. 8996- వన్డేల్లో 216 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ సాధించిన పరుగులు. మరో నాలుగు పరుగులు చేస్తే 9వేల పరుగులు మార్కును చేరుకుంటాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్ (205) తర్వాత అత్యంత వేగంగా ఈ మార్కును చేరిన ప్లేయర్‌గా రోహిత్ నిలుస్తాడు. 4983- వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన పరుగులు. మరో 17 పరుగులు చేస్తే 5వేల పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా నిలుస్తాడు. అయితే అందరికంటే వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డు కూడా అతని సొంతమవుతుంది. 98- వన్డేల్లో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ తీసిన వికెట్లు. ఇప్పటివరకు 60 వన్డేలాడని కమిన్స్ 98 వికెట్లు తీశాడు. ఆసీస్ నుంచి ఐదుగురు మాత్రమే 60 వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని దాటారు. ముంబై వన్డేలో రెండు వికెట్లు తీసిన కమిన్స్.. రాజ్‌కోట్ వన్డేలో వికెట్లు తీయలేకపోయాడు. బెంగళూరులో రెండు వికెట్లు సాధిస్తే 100 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిని కలిపి వన్డేల్లో ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఔట్ చేశాడు. రాజ్‌కోట్‌ వన్డేలో కోహ్లీని పెవిలియన్‌కు పంపి, అతణ్ని ఐదుసార్లు ఔట్ చేసిన ఏకైక స్పిన్నర్‌గా నిలిచాడు. మరోవైపు విండీస్ బౌలర్ అంటోని మారిన, జంపా వీరిద్దరూ మాత్రమే రోహిత్‌ను వన్డేల్లో మూడుసార్లు ఔట్ చేశారు.














Untitled Document
Advertisements