రైలు ప్రయాణం చేసేవారి కోసం కొత్త యాప్!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 07:19 PM

రైళ్లు మరియు రైల్వే స్టేషన్ల కోసం ఒక ప్రత్యేకమైన ఓటీటీ తరహా యాప్ ను ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఆ యాప్ లో యాడ్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ఆలోచన చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకుంటోంది. ఈ కంటెంట్ ఆన్ డిమాండ్ (CoD) యాప్ ను దశలవారీగా ప్రారంభించనుంది. మొదట కేవలం నాలుగు రైళ్లకు రాబోయే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. వీటికి 45 రోజుల్లో ఈ సేవలు లభించనున్నాయి. రాబోయే రెండేళ్లలో దశలవారీగా అన్ని రైళ్లలో ఈ సర్వీసులు ప్రారంభించబడతాయి. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! రైలు ప్రయాణికుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఒక యాప్ ఉంటుంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ల్లో ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వివిధ భాషలకు చెందిన కంటెంట్(సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, వినోద కార్యక్రమాలు, లైఫ్ స్టైల్ మొదలైనవి) అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ప్రయాణ సమయంలో లేదా ప్రయాణం పూర్తయ్యాక అయినా సరే ఈ కంటెంట్ ను స్ట్రీమ్ చేయవచ్చు. రైలు కోచ్‌లలో వైఫై యాక్సెస్ పాయింట్‌లతో పాటు కంటెంట్ సర్వర్‌లను ప్రత్యేకంగా ఇన్‌స్టాల్ చేస్తారు. ఇందులో ప్రసారమయ్యే కంటెంట్ ను గుర్గావ్ మరియు సికింద్రాబాద్‌లోని రైల్‌టెల్ డేటా సెంటర్లలో ఏర్పాటు చేసిన సెంట్రల్ సర్వర్ నిర్వహిస్తారు. ఇందులో ఉన్న కంటెంట్ ను ప్రయాణీకులు హైస్పీడ్ వేగంతో స్ట్రీమ్ చేయవచ్చని, రైలు నడుస్తున్నప్పుడు బఫరింగ్ కూడా ఉండదని రైల్ టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వే స్టేషన్ లో రైలు ఆగినప్పుడు రైల్‌టెల్ స్టేషన్ వైఫై నెట్‌వర్క్ ద్వారా అన్ని రైళ్ల కోచ్ సర్వర్‌లలో కంటెంట్ ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుందని పేర్కొంది. మన దేశంలోని 5,573 రైల్వే స్టేషన్లలో ఈ రైల్ టెల్ అందుబాటులో ఉందని చెప్పారు. రైల్‌టెల్ ఈ యాప్ కోసం ఫ్రీమియం మోడల్‌ను ఎంచుకుంటుంది. అవును! నేను తప్పు రాయలేదు. మీరు తప్పుగా చదవలేదు. అది ‘ఫ్రీ’మియమే. ఇందులో ఉన్న కంటెంట్ ను ప్రయాణికులు ఉచితంగా చూడవచ్చు. కానీ వీటిలో యాడ్లను అందించడం ద్వారా రైల్వేలు ఆదాయాన్ని సంపాదిస్తాయి. అయితే ఇందులో ఉన్న ప్రీమియం కంటెంట్ ను చూడటానికి సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంది. నిర్దేశిత మొత్తం చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ కంటెంట్ ను వీక్షించవచ్చు. ఇందులో అయితే అడ్వర్టైజ్ మెంట్లు కూడా రావు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ వంటి పేమెంట్ ఆప్షన్ల ద్వారా మీరు ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ కంటెంట్ యాప్ అన్ని ప్రీమియం, మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే, అన్ని సబర్బన్ రైళ్లు, వైఫై ఎనేబుల్డ్ రైల్వే స్టేషన్లు ఈ సర్వీస్ ను పొందుతాయి. భారతీయ రైల్వేలోని మొత్తం 17 జోన్‌ల్లో రైల్‌టెల్ స్టేషన్ వైఫై నెట్‌వర్క్ ఉంది. ఈ సేవలు ఇప్పటివరకు 5,573 స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. రైల్ కోచ్‌ల్లో వైఫై యాక్సెస్ పాయింట్‌లతో పాటు కంటెంట్ సర్వర్‌లు కూడా ఇన్‌స్టాల్ చేయబడతాయి, ఇవి కంటెంట్‌ను ప్రయాణీకుల డివైస్ లకు చేరవేస్తాయి. రైళ్లకు కాస్త ఎక్కువ సేపు ఆగే అన్ని ఏ1 కేటగిరీ స్టేషన్లలో కంటెంట్ అప్‌డేట్ సర్వర్లు /కాషింగ్ సర్వర్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. రైల్‌టెల్ కు దేశవ్యాప్తంగా ఉన్న MPLS నెట్‌వర్క్ ద్వారా కంటెంట్ అప్ డేట్, రిఫ్రెష్ అవుతుంది. ఈ యాప్ మీరు కంటెంట్‌ను సెర్చ్ చేయడానికి, చూడటానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రైలు ప్రయాణీకులు వారి ఫోన్లలో సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్ మరియు ఇతర కంటెంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారికి ఇష్టం వచ్చినప్పుడు దాన్ని చూడవచ్చు. ఈ యాప్ కంటెంట్ మాత్రమే కాకుండా వివిధ సేవలను కూడా అందిస్తుంది. దీనికోసం ఈ-కామర్స్, ట్రావెల్ మరియు బుకింగ్స్ లో వివిధ సర్వీసు ప్రొవైడర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నారు. ఈ యాప్ లో ఎన్నో ఇన్‌బిల్ట్ ఆప్షన్లు ఉన్నాయి. భాగస్వామ్య సేవలను అందుకోవడానికి ప్రత్యేకంగా లింక్ లను కూడా అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను దశల వారీగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటగా ఎంపిక చేసిన నాలుగు రైళ్లలో ఈ సేవలను రానున్న 45 రోజుల్లో ప్రారంభించనున్నారు. రాబోయే రెండేళ్లలో లేదా 2022 నాటికి అన్ని రైళ్లలో దశలవారీగా ఈ సేవలు ప్రారంభం అవుతాయి. డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ సర్వీస్ ప్రొవైడర్(డీఈఎస్ పీ) ఈ సేవల కోసం రైల్ టెల్ తో మినిమం గ్యారంటీ మొత్తాన్ని ఫిక్స్ చేసుకుంటుంది. ఈ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారతీయ రైల్వే, రైల్ టెల్ పంచుకోనున్నాయి.























Untitled Document
Advertisements