శింబుకి పేరు పెట్టండి...ఫ్యాన్స్ కి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 08:17 PM

శింబుకి పేరు పెట్టండి...ఫ్యాన్స్ కి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్!

సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు త్వరలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ బ్యానర్‌లో తెరకెక్కించాలని చాలా రోజుల కిందటే ప్రయత్నాలు జరిగినా.. శింబు, గౌతమ్‌ల మధ్య వివాదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా మరో నిర్మాతతో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మానాడు సినిమా పట్టాలెక్కుతోంది. 2018 నుంచే చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2020లో సెట్స్‌ మీదకు రావటం విశేషం. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించారుచిత్రయూనిట్. అంతేకాదు ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు వెంకట్‌ ప్రభు ఆడియన్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో శింబు ఓ ముస్లిం యువకుడి పాత్రలో కనిపించనున్నాడని వెల్లడించిన వెంకట్ ప్రభు, ఆ పాత్రకు ఓ పేరును సజెస్ట్ చేయాల్సిందిగా అభిమానులను కోరాడు. తాము కరెక్ట్ అనుకుంటున్న పేర్లను అభిమానులు #str_as అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విటర్‌లో షేర్‌ చేయాలని సూచించాడు. ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్‌ నటిస్తుండగా ఎస్‌ఏ చంద్రశేఖర్‌, భారతీరాజా, ప్రేమ్‌జీ అమరన్‌, కరుణాకరన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్‌ కామాట్చి నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నాడు. గతంలో యువన్‌, శింబు కాంబినేషన్‌లో భారీ మ్యూజికల్‌ హిట్స్ వచ్చాయి. దీంతో మరోసారి అదే కాంబినేషన్‌ రిపీట్ అవుతుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రిచర్డ్ ఎన్‌ నతన్‌ సినిటోగ్రఫి అందిస్తుండగా ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని చిత్రయూనిట్ వెల్లడించారు.





Untitled Document
Advertisements