భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్పై ఇటీవల వరుసగా ఊహగానాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టును ధోనీకి బీసీసీఐ నిరాకరించడంతో తన రిటైర్మెంట్పై అనుమానాలు బలపడ్డాయి. ఈక్రమంలో వీటిన్నింటికి తెరదించుతూ ఐపీఎల్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ మాజీ చీఫ్ కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ధోనీ బరిలోకి దిగుతాడని సీఎస్కే జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ తాజాగా వెల్లడించారు. జట్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ సీజన్తోపాటు వచ్చే సీజన్ కూడా ధోనీ ఆడతాడని ఆయన స్పష్టం చేశారు. దీంతో ధోనీ అభిమానుల్లో సంబరాలు అంబరన్నాంటాయి.
“MS Dhoni will play this year. And next year he will be in the auction and he will be retained.”
mdash; Troll CSK Haters™ (@CSKFansArmy) January 18, 2020
- N Srinivasan on @msdhoni #WhistlePodu pic.twitter.com/kDGnTDmaaf