అల్లు అర్జున్ హీరోగా తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. అల్లు అర్జున్ పాత్రలో సంబంధం లేని పలు సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు సుకుమార్. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సుకుమార్ గత చిత్రం రంగస్థలం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అందుకే అలాంటి సౌండింగ్ వచ్చేలా ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. కథ ప్రకారం కూడా ఈ సినిమా శేషాచలం అడవుల బ్యాక్డ్రాప్లోనే సాగుతుందని అందుకే ఈ టైటిల్ కరెక్ట్గా సరిపోతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా స్టైలిష్ స్టార్ అభిమానులు మాత్రం టైటిల్ వార్తలపై పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.