ఈ ఏడాది కూడా డౌటే!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 01:06 PM

ఈ ఏడాది కూడా డౌటే!

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ తరువాతి సినిమాను కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేశాడు. బాహుబలికి పూర్తి భిన్నంగా ఓ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2017 బాహుబలి 2 రిలీజ్‌ అయితే 2019లో సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో రిలీజ్‌ తరువాత మరోసారి లాంగ్‌ గ్యాప్ తీసుకున్నాడు ప్రభాస్. దాదాపు నాలుగు నెలల పాటు షూటింగ్‌ మొదలు పెట్టుకుండా విదేశాల్లో ఎంజాయ్‌ చేశాడు. ఇటీవల ప్రభాస్‌ కొత్త సినిమా సెట్స్‌ మీదకు వచ్చింది. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. బాహుబలి, సాహో సినిమాల తరువాత వేగంగా సినిమాలు చేసేందుకు ట్రై చేస్తానంటూ ప్రభాస్ మాట ఇచ్చాడు. కానీ ఆ మాటలను డార్లింగ్‌ నిలబెట్టుకోలేకపోయాడు. నాలుగు నెలల గ్యాప్‌ తరువాత కొత్త సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. ఈ సినిమా కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతుండటంతో షూటింగ్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రభాస్‌ నెక్ట్స్ సినిమా కోసం చాలా రోజుల నిరీక్షణ తప్పేలా లేదు. ఈ సినిమాను ప్రభాస్‌, పెదనాన సీనియర్‌ నటుడు కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. ఇటీవల కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ రిలీజ్ డేట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందన్న కృష్ణంరాజు, త్వరలో విదేశాల్లో మూడు నెలల భారీ షెడ్యూల ఉంటుందని వెల్లడించారు. అయితే రిలీజ్ మాత్రం ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే సంవత్సరం వేసవిలో ఉంటుందని షాక్‌ ఇచ్చాడు. గత మూడు చిత్రాలు ఒక్కో సినిమాకు రెండేళ్ల విరామం తీసుకున్నాడు ప్రభాస్‌. ఇప్పుడు నెక్ట్స్ సినిమా విషయంలో కూడా రెండేళ్ల విరామం తప్పేలా లేదు. ఈ జనరేషన్ హీరోలు కనీసం ఏడాది ఒక్క సినిమా అన్నా చేస్తూ పోతుంటే ప్రభాస్‌ మాత్రం నెమ్మది సినిమాలు చేయటం పట్ట అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

















Untitled Document
Advertisements