రాహుల్ గాంధీకి సివిల్ కోర్టు సమన్లు జారీ

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 01:13 PM

రాహుల్ గాంధీకి సివిల్ కోర్టు సమన్లు జారీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాంఛీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… నరేంద్ర మోడీ.. నీరవ్ మోడీ.. లలిత్ మోడీ.. వీళ్లందరికి మోడీ అని ఎందుకుంది? ఎందుకంటే ఇంటి పేరు మోడీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ”మోడీ చోర్ హై” అని ఆరోపించడంతో భోపాల్ కు చెందిన ప్రదీప్ మోడీ అనే ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు వచ్చే నెల 22వ తేదీన రాహుల్ కోర్టు ముందు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు.





Untitled Document
Advertisements