ఖమేనీకి హెచ్చరిక

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 01:18 PM

ఖమేనీకి హెచ్చరిక

మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని హెచ్చరించారు. ‘ఇరాన్ సుప్రీం లీడర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి అమెరికా, యూరప్ పట్ల హేయంగా మాట్లాడుతున్నారు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతకుముందు శుక్రవారం టెహరాన్‌లో ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఈ విధంగా స్పందించారు. ‘ఖమేనీ తన ప్రసంగంలో అమెరికాపై మండిపడుతూ కఠిన పదజాలం వాడారు. బ్రిటన్, ఫ్రాన్స్,జర్మనీలు అమెరికా చెప్పుచేతల్లో ఉండే నౌకర్లు అనడం చాలా తప్పు. వారి (ఇరాన్) ఆర్థిక వ్యవస్థ కూలిపోతోంది. ఆ దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements