IND vs AUS 3rd ODI: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:10 PM

IND vs AUS 3rd ODI: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌ ఇప్పటికే 1-1తో సమమవగా.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి సిరీస్‌ దక్కనుంది. ఈ నేపథ్యంలో.. రెండు జట్లూ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో టాస్ గెలిచిన అరోన్ ఫించ్.. మూడో వన్డేలోనూ టాస్ గెలిచినా ఈసారి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో 341 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 304 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో.. ఈసారి కంగారూలు వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తుది జట్టులో ఒక మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ రిచర్డ్‌సన్ స్థానంలో హేజిల్‌వుడ్ టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు భారత్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. రిషబ్ పంత్ ఫిట్‌నెస్ సాధించినప్పటికీ.. అతడికి కీపర్‌గా అవకాశమివ్వని కోహ్లీ.. కేఎల్ రాహుల్‌ని కీపర్‌గా కొనసాగించాడు.




India (Playing XI): Rohit Sharma, Shikhar Dhawan, Virat Kohli(c), Shreyas Iyer, Lokesh Rahul(w), Manish Pandey, Ravindra Jadeja, Mohammed Shami, Navdeep Saini, Kuldeep Yadav, Jasprit Bumrah

Australia (Playing XI): David Warner, Aaron Finch(c), Steven Smith, Marnus Labuschagne, Alex Carey(w), Ashton Turner, Ashton Agar, Pat Cummins, Mitchell Starc, Josh Hazlewood, Adam Zampa

2019లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ని కంగారూలు 3-2 తేడాతో గెలుపొందారు. ఆ సిరీస్‌ తొలి రెండు వన్డేల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా మూడు వన్డేల్లోనూ గెలుపొందింది. దీంతో ఆ జట్టుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.





Untitled Document
Advertisements