నలుగురు కూతుళ్లపై మదమెక్కిన పశువులా కన్న తండ్రి ప్రవర్తన!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 05:54 PM

నలుగురు కూతుళ్లపై మదమెక్కిన పశువులా కన్న తండ్రి ప్రవర్తన!

బిడ్డలనే కనికరం లేకుండా కన్న తండ్రి మదమెక్కిన పశువు మాదిరిగా ప్రవర్తించాడు. మైనర్ బాలికలైన కూతుళ్లపై రోజూ అమానుషంగా రెచ్చిపోయాడు. కేరళ రాష్ట్రంలోని వాలంచేరీలో ఈ దారుణం చోటుచేసుకుంది. సొంత కుమార్తెలపైనే దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 47 ఏళ్ల ఓ వ్యక్తి కేరళలోని వాలంచేరిలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి 17, 15, 13, 10 వయసు గల నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో 11, 9, 7, 5 తరగతులు చదువుతున్నారు. కూలీగా పనిచేస్తున్న అతడు తాగుడుకు బానిసయ్యాడు. మద్యం సేవించి వచ్చి రోజుకొకరి చొప్పున కన్న కుమార్తెలు అని కూడా చూడకుండా వారిపై లైంగికంగా దాడి పాల్పడ్డాడు. రోజూ తనపై జరుగుతున్న ఈ అమానుషాన్ని భరించలేకపోయిన చిన్న కుమార్తె (10) ఈ విషయాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పింది. తనతో శారీరకంగా కలిసేటట్లయితేనే పాఠశాల నుంచి ఇంటికి రండి అని బెదిరించేవాడని చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారికి దిగ్భ్రాంతికి గురయ్యారు. నలుగురు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా లైంగిక వేధింపులకు గురైనట్లు తేలింది. దీంతో వారిని మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం కోసం హాజరు పరిచారు. అనంతరం పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ కీచకుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించిందన్నారు.





Untitled Document
Advertisements