భారత్ నుంచి శ్రీలంకకు ఆర్థిక భద్రతా సహాయం!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 07:51 PM

భారత్ నుంచి శ్రీలంకకు ఆర్థిక భద్రతా సహాయం!

శ్రీలంకకు 50 మిలియన్ డాలర్ల ఆర్థిక భద్రతా సహాయం అందించడానికి భారత్ అంగీకరించింది. ఈ మేరకు భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్సకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు విస్తృత స్థాయిలో జరిగాయి. రక్షణలో నిఘా విభాగాల్లో పరస్పర సహకారాన్ని తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసుకోడానికి చర్చించారు. ధోవల్ శనివారం కొలంబో వచ్చారు. అనేక మంది విదేశీ దౌత్యవేత్తలను కలుసుకున్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించారు. శ్రీలంక భద్రతా దళాలకు కావలసినవి కొనుగోలు చేయడానికి ధోవల్ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. నిఘా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి కూడా సహకరించనున్నట్టు వివరించింది.





Untitled Document
Advertisements