ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్ ప్యాక్ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ను ఆదివారం ప్రకటించింది.‘‘రూ.179 ప్లాన్ గడువు 28 రోజులు. 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. వీటితో పాటు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే జీవిత బీమా ఈ ప్యాక్తో పాటు లభిస్తాయి’’ అని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ను పరిమితంగా వినియోగించే వారిని, ఫీచర్ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 18-54 వయస్సు కలిగిన వారికి జీవిత బీమా వర్తిస్తుంది. ఇందుకోసం ఎలాంటి పత్రాలు గానీ, వైద్య పరీక్షలు గానీ అవసరం లేదని ఎయిర్టెల్ తెలిపింది. బీమాకు సంబంధించిన పాలసీ పత్రాలను తక్షణమే డిజిటల్ రూపంలో పంపిస్తామని, అవసరమైతే కాగితం రూపంలోనూ అందిస్తామని పేర్కొంది. జీవిత బీమాతో కూడిన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లకు అనూహ్య స్పందన వస్తోందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వంత్ శర్మ పేర్కొన్నారు.