టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధత గురించి మాట్లాడటానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నిరాకరించాడు. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్ కాలానికి కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ధోనీ చోటు కోల్పోయాడు. దీంతో ధోని రిటైర్మెంట్ కథ క్లైమాక్సుకు చేరుకున్నట్లేనానని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై స్పందించాలని దాదాని కోరగా అతడు నిరాకరించాడు. ‘‘దీనిపై నేను స్పందించను’’ అని తెలిపాడు.