రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:31 AM

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ని ఎన్నుకొని కేరళ ప్రజలు ఘోరమైన పని చేశారని వ్యాఖ్యానించారు. కేరళలో ‘లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో ‘దేశభక్తి వర్సెస్‌ యుద్ధోన్మాదం’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కష్టపడి పనిచేసే, స్వయంగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీపై ఐదోతరానికి చెందిన రాహుల్‌’ గెలిచే అవకాశం లేదు. స్వాతంత్ర్య పోరులో గొప్ప పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్‌ దయనీయమైన కుటుంబ సంస్థగా మారడమే.. దేశంలో హిందుత్వ, యుద్ధోన్మాద ప్రాబల్యం పెరిగడానికి కారణం’ అని చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements