జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:32 AM

రాబోయే రెండు నెలలకు జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రూ. 1.15లక్షల కోట్లు, మార్చి నెలలో రూ. 1.25లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు నెలకు రూ. 1.1లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. తాజాగా దాన్ని రూ. 1.15లక్షల కోట్లకు పెంచారు.





Untitled Document
Advertisements