వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:36 AM

వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ వేములవాడలో ప్రసంగించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచన చేశాయా? అనే విషయాన్ని ఆచోచించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు.





Untitled Document
Advertisements