పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సీఏఏకి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన ‘జన జాగరణ్ అభియాన్’ కార్యక్రమంలో ఆదివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘సీఏఏని అమలు చేయబోమంటూ రాష్ట్రాలు తీర్మానం చేయొచ్చు. అది కేవలం ఓ రాజకీయ ప్రకటన మాత్రమే. కానీ అవి చట్టం అమలును ఆపలేవు. పార్లమెంట్లో ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.