ఓ ఇంటివాడైన ‘ట్రిపుల్ సెంచరీ వీరుడు‘

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 12:10 PM

ఓ ఇంటివాడైన ‘ట్రిపుల్ సెంచరీ వీరుడు‘

ఇండియన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు సనయా టాంకరివాలాను పెళ్లి చేసుకున్నాడు.. కరుణ్ నాయర్ పెళ్లి, రిసెప్షన్ కు భారత క్రికెటర్లు వరుణ్ ఆరోన్, యుజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ అజింక్య రహానె అటెండ్ అయ్యారు. కరుణ్ నాయర్ సనయా టాంకరివాలా పెళ్లి ఫోటోలను ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆరు టెస్టులు ఆడిన కరుణ నాయర్ టెస్టుల్లో 303 పరుగులు (నాటౌట్ ) తో భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.





Untitled Document
Advertisements