టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో సెటైర్లు విసిరారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చంద్రబాబు విపక్ష నేతనా లేక 29 గ్రామాలకే విపక్ష నేతనా అని ప్రశ్నించారు. రాజధాని ఉద్యమం పేరుతో హైదరాబాద్ కూకట్పల్లి నుంచి మహిళలను తీసుకువచ్చి నిరసనలు చేయిస్తున్నారని అన్నారు.
పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి ఎందుకొచ్చారని, ఐదేళ్ళు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా అని నిలదీశారు. ఆనాడు ఏ అనుభవం ఉందని రాజధానిపై నారాయణ అధ్యక్షతన కమిటీ వేశారని అడిగారు. అందుకే చంద్రబాబును ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ప్రజా సమస్యలపై ఏనాడు జోలే పట్టని చంద్రబాబు, 40 ఏళ్ళ కుర్రాడు జగన్ కొట్టిన దెబ్బకు జోలె పట్టి అడ్డుకుంటున్నాడని తెలిపింది.